కోవిడ్ -19:విదేశాల నుంచి రెసిడెంట్స్ తిరిగి వచ్చేందుకు ఆన్ లైన్ నమోదు
- March 22, 2020యూఏఈ:విదేశాల్లో ఉన్న యూఏఈ నివాసితులు తిరిగి దేశంలోకి వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తవజుది(Tawajudi for residents) అనే వెబ్ సైట్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లు చేసుకోవచ్చని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను యూఏఈ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో యూఏఈకి చెందిన నివాసితులు ఎక్కడిక్కడ చిక్కుకుపోయారు. అలాంటి వారు అత్యవసర పరిస్థితులు ఉంటే యూఏఈకి తిరిగి వచ్చేలా ప్రస్తుత ఆన్ లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లోని తవజుది ఫర్ రెసిడెన్సీ ద్వారా వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాంగ శాఖ అధికారులు ఆన్ లైన్ లో నమోదైన వివరాలను పరిశీలించి ఆమోదం అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ