కువైట్ లో పాక్షిక కర్ఫ్యూ ,రెండు వారాల పాటు సెలవు పొడిగింపు
- March 22, 2020
కువైట్:కువైట్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఇంటి వద్ద ఉండటానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలను పాటించకపోవడం వలన కువైట్ ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని ఒక సీనియర్ అధికారి శనివారం చెప్పారు. డిప్యూటీ ప్రీమియర్, ఇంటీరియర్ మంత్రి అనాస్ అల్ సలేహ్ ఒక క్యాబినెట్ సమావేశం తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ 11 గంటల కర్ఫ్యూ ఆదివారం సాయంత్రం 5 నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 4 వరకు ప్రారంభమవుతుంది.ఇంటి వద్ద ఉండటానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలను పాటించకపోవడం వలన ప్రభుత్వం కర్ఫ్యూ విధించవలసి వచ్చిందని కేబినెట్ వ్యవహారాల రాష్ట్ర మంత్రి కూడా సలేహ్ అన్నారు. కీలక రంగాలలో పనిచేసే వ్యక్తుల కోసం సివిల్ డిఫెన్స్ కమిటీ ఐడిలను జారీ చేస్తుందని, దాని వలన వారు కర్ఫ్యూ సమయంలో అనుమతించవచ్చని ఆయన అన్నారు.
ఈ నెల 26 తో ముగియనున్న ప్రభుత్వ విభాగాలు మరియు ప్రైవేట్ సంస్థల సెలవుదినాన్ని రెండు వారాల పాటు పొడిగిస్తామని సలేహ్ చెప్పారు. ఉల్లంఘించినవారికి కఠినమైన జరిమానాలు ప్రకటించబడ్డాయి, వీటిలో 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా KD 10,000 జరిమానా విధిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







