కోవిడ్ -19:విదేశాల నుంచి రెసిడెంట్స్ తిరిగి వచ్చేందుకు ఆన్ లైన్ నమోదు
- March 22, 2020యూఏఈ:విదేశాల్లో ఉన్న యూఏఈ నివాసితులు తిరిగి దేశంలోకి వచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తవజుది(Tawajudi for residents) అనే వెబ్ సైట్ లో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ లు చేసుకోవచ్చని సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులను యూఏఈ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో యూఏఈకి చెందిన నివాసితులు ఎక్కడిక్కడ చిక్కుకుపోయారు. అలాంటి వారు అత్యవసర పరిస్థితులు ఉంటే యూఏఈకి తిరిగి వచ్చేలా ప్రస్తుత ఆన్ లైన్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లోని తవజుది ఫర్ రెసిడెన్సీ ద్వారా వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాంగ శాఖ అధికారులు ఆన్ లైన్ లో నమోదైన వివరాలను పరిశీలించి ఆమోదం అనుమతి ఇస్తారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు