కువైట్ లో పాక్షిక కర్ఫ్యూ ,రెండు వారాల పాటు సెలవు పొడిగింపు
- March 22, 2020కువైట్:కువైట్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఇంటి వద్ద ఉండటానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలను పాటించకపోవడం వలన కువైట్ ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని ఒక సీనియర్ అధికారి శనివారం చెప్పారు. డిప్యూటీ ప్రీమియర్, ఇంటీరియర్ మంత్రి అనాస్ అల్ సలేహ్ ఒక క్యాబినెట్ సమావేశం తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ 11 గంటల కర్ఫ్యూ ఆదివారం సాయంత్రం 5 నుండి మరుసటి రోజు తెల్లవారుజామున 4 వరకు ప్రారంభమవుతుంది.ఇంటి వద్ద ఉండటానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలను పాటించకపోవడం వలన ప్రభుత్వం కర్ఫ్యూ విధించవలసి వచ్చిందని కేబినెట్ వ్యవహారాల రాష్ట్ర మంత్రి కూడా సలేహ్ అన్నారు. కీలక రంగాలలో పనిచేసే వ్యక్తుల కోసం సివిల్ డిఫెన్స్ కమిటీ ఐడిలను జారీ చేస్తుందని, దాని వలన వారు కర్ఫ్యూ సమయంలో అనుమతించవచ్చని ఆయన అన్నారు.
ఈ నెల 26 తో ముగియనున్న ప్రభుత్వ విభాగాలు మరియు ప్రైవేట్ సంస్థల సెలవుదినాన్ని రెండు వారాల పాటు పొడిగిస్తామని సలేహ్ చెప్పారు. ఉల్లంఘించినవారికి కఠినమైన జరిమానాలు ప్రకటించబడ్డాయి, వీటిలో 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా KD 10,000 జరిమానా విధిస్తారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ