తమిళ దర్శక నిర్మాత విసు కన్నుమూత
- March 22, 2020చెన్నై:ప్రముఖ నటుడు దర్శకుడు, సినీ రచయిత విసు చెన్నైలో కన్నుమూశారు.గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.ఆయన ఆకస్మిక మరణం సినీ లోకాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
విసు అసలు పేరు మీనాక్షి సుందరం రామస్వామి విశ్వనాధన్. ఆయనను ముద్దుగా విసు పిలుచుకొనే వారు. 1945 జూలైలో జన్మించిన ఆయన వయసు 75 సంవత్సరాలు. తెలుగు సినిమా పరిశ్రమకు దాదాపు 30 ఏళ్లకుపైగా సేవలందించారు. వెండితెర, టెలివిజన్పై కుటుంబ నేపథ్యం ఉన్న చిత్రాలను రూపొందించి ప్రేక్షకులను మెప్పించారు.
సంసారం ఒక చదరంగం, చిదంబర రహస్యం, ఆడదే ఆధారం లాంటి చిత్రాలను రూపొందించారు. తెలుగు, తమిళ భాషల్లో కలిపి 50కి పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా, దర్శకత్వం చేపట్టారు. పలు సినిమాలకు మాటలు రాశారు. ఆయన సినిమాల్లో సామాజిక బాధ్యత, కుటుంబ విలువలు ఎక్కువగా కనిపించేవి.
సినిమాల నుంచి దూరమైన తర్వాత 2016లో ఆయన బీజేపీలో చేరారు. జాతీయభావం, ఆధ్యాత్మికభావం కారణంగానే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. కానీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనలేకపోయారు. వయసుపై బడటంతో పార్టీకి పెద్దగా సేవలు అందించలేకపోయారని సన్నిహితులు చెప్పుకొంటారు.
ఆయన మరణ వార్తను తెలుసుకొన్న వెంటనే పలువురు సినీ ప్రముఖులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు