'మనం సైతం'కు రూ.5 లక్షలు అందజేసిన దర్శకుడు వి.వి. వినాయక్
- March 25, 2020కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో దినసరి వేతనంతో బతికే పేద కళాకారులు, టెక్నీషియన్స్ ఇబ్బందులు పడుతున్నారు. అలాంటివారికి సాయం చేసేందుకు డైరెక్టర్ వి.వి. వినాయక్ తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. నటుడు కాదంబరి కిరణ్కుమార్ ఆధ్వర్యంలో నడుస్తోన్న 'మనం సైతం' ఫౌండేషన్కు రూ. 5 లక్షలు అందజేశారు. నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పేద సినీ కళాకారులు, సాంకేతిక విభాగాల్లో పనిచేసే కార్మికులు మనం సైతంను సంప్రదించి, వాటిని పొందవచ్చని ఆయన తెలిపారు.
ఈ విషయాన్ని ఒక వీడియో సందేశం ద్వారా వినాయక్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, "ఈరోజు అందర్నీ వణికిస్తోన్న కరోనా వైరస్ను మన ఇళ్లల్లో మనం ఉండి వణికించాలి. ఫిల్మ్ ఇండస్ట్రీలోని పేద కళాకారులు, టెక్నీషియన్లు, డాన్సర్లు, ఫైటర్లు.. ఎవరైనా కానివ్వండి.. నెల రోజుల పాటు షూటింగ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్లకు నిత్యావసర వస్తువులను అందజేసే నిమిత్తం నా వంతుగా రూ. 5 లక్షల చెక్కును మనం సైతం కాదంబరి కిరణ్కుమార్కు అందజేస్తున్నా. నిజంగా ఎవరికి అవసరమో వారు కాదంబరి కిరణ్ గారిని సంప్రదించి, నిత్యావసర వస్తువులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నా" అని చెప్పారు. నిరంతరం పేద సినీ కళాకారుల సంక్షేమం కోసం పరితపిస్తోన్న 'మనం సైతం' ఫౌండేషన్ను ఈ సందర్భంగా వినాయక్ ప్రశంసించారు. అందుకే ఆ ఫౌండేషన్ ద్వారా తన వంతుగా ఈ చిన్న సాయాన్ని చేస్తున్నానని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ