యూఏఈ:వారంతంలో రవాణా వ్యవస్థ బంద్
- March 26, 2020
యూఏఈ:కరోనా వైరస్ కట్టడికి యూఏఈ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ వారంతంలో దేశవ్యాప్తంగా స్టెరిలైజేషన్ (కెమికల్స్ తో శుద్ధి చేయటం) చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ నెల 26న రాత్రి 8 గంటల నుంచి 29 ఉదయం 6 గంటల వరకు దుబాయ్ మెట్రోతో సహా ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేయనున్నట్లు యూఏఈ ప్రకటించింది. జాతీయ స్టెరిలైజేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రజా సంస్థలు, ప్రజా రవాణా సంస్థకు చెందిన వాహనాలు, మెట్రో సర్వీసులను అన్నింటిని స్టెరిలైజ్ చేయనున్నారు. ఈ నాలుగు రోజులు దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ను నియంత్రించటంతో పాటు అన్ని రకాల రవాణా సౌకర్యాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ నాలుగు రోజులు ప్రజలు ఎవరు బయటికి రావొద్దని కూడా ఆరోగ్య, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. అయితే..ఆహారం, మెడిసిన్ కావాల్సిన వారికి మాత్రం బయటికి వచ్చేందుకు మినహాయించారు. అలాగే మిలటరీ, పోలీసులు, ఆరోగ్య శాఖకు చెందిన ఉద్యోగులు, విద్యుత్, పోస్టల్, పోస్టల్, గ్యాస్ స్టేషన్ తరహా ఎమర్జెన్సీ ఉద్యోగులకు కూడా మినహాయింపు ఇచ్చారు. ఎమర్జెన్సీ విభాగాల ఉద్యోగుల సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయిని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







