కరోనా ఎఫెక్ట్:దుబాయ్ లో ఇక నుంచి ట్యాక్సీలో ఇద్దరికే అనుమతి
- March 26, 2020
దుబాయ్:కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దుబాయ్ రవాణా శాఖ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్యాక్సీ ఇద్దరికి మించి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఒక ట్యాక్సీలో డ్రైవరుతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతించనున్నారు. అలాగే బస్, మెట్రోలో కూడా ప్రయాణికులు నిర్దిష్ట దూరాన్ని పాటించాలని సూచించారు. బస్ రియర్ డోర్ ను మూసి ఉంచి ముందు వెనక డోర్ల ద్వారా ప్యాసింజర్లను అనుమతిస్తారు. అయితే..బస్ షెల్టర్ లు మాత్రం తాత్కాలికంగా మూసివేసే ఉంటాయి. ప్రయాణికుల అవసరం మేరకు మెట్రో సర్వీసు ట్రిప్పుల సంఖ్యను పెంచనున్నారు. పీబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రైడర్లు వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించకపోవటమే మేలని ఆర్టీఏ అధికారులు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాల మేరకు దుబాయ్ ఆర్టీఏ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







