కరోనా ఎఫెక్ట్:దుబాయ్ లో ఇక నుంచి ట్యాక్సీలో ఇద్దరికే అనుమతి
- March 26, 2020
దుబాయ్:కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దుబాయ్ రవాణా శాఖ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ట్యాక్సీ ఇద్దరికి మించి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఒక ట్యాక్సీలో డ్రైవరుతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతించనున్నారు. అలాగే బస్, మెట్రోలో కూడా ప్రయాణికులు నిర్దిష్ట దూరాన్ని పాటించాలని సూచించారు. బస్ రియర్ డోర్ ను మూసి ఉంచి ముందు వెనక డోర్ల ద్వారా ప్యాసింజర్లను అనుమతిస్తారు. అయితే..బస్ షెల్టర్ లు మాత్రం తాత్కాలికంగా మూసివేసే ఉంటాయి. ప్రయాణికుల అవసరం మేరకు మెట్రో సర్వీసు ట్రిప్పుల సంఖ్యను పెంచనున్నారు. పీబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రైడర్లు వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించకపోవటమే మేలని ఆర్టీఏ అధికారులు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాల మేరకు దుబాయ్ ఆర్టీఏ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







