దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణీకులకు కాన్సులేట్ చేయూత
- March 27, 2020
దుబాయ్: కరోనా వైరస్ తో ప్రపంచం అతలాకుతలం అయిపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ రాకపోకలపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలతో విమానాశ్రయాలలోనే ఎంతోమంది తమ దేశాలకు వెళ్లే క్రమంలో చిక్కుకుపోతున్నారు.
ఈ క్రమంలో స్వదేశాలకు వెళ్తూ దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన 19 మంది భారతీయ పౌరులు తమని ఆదుకోండి అంటూ అధికారులను వేడుకుంటున్నారు. వీరిని కాపాడేందుకు యూఏఈ ప్రభుత్వం భారత అధికారులతో సంప్రదింపులు జరిపి వారికి విమానాశ్రయం లోపల హోటల్ గదులు ఇచ్చారు. వారికి ఆహార ఏర్పాట్లు మరియు ఆర్ధిక సహాయం అందిస్తూ ఇండియన్ కాన్సులేట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటోంది. ఈ సందర్భంగా చిక్కుకున్న 19 మంది భారతీయులు యూఏఈ మరియు ఇండియన్ కాన్సులేట్ కు కృతఙ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు