అమ్మకందారులూ నిబంధనల్ని ఉల్లంఘించొద్దు
- January 25, 2016
దిగుమతిదారులు, అమ్మకందారులు ఆహార పదార్థాల అమ్మకం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనల్ని అతిక్రమించి, ఆహార పదార్థాల్ని (ప్యాకేజింగ్, నాన్ ప్యాకేజింగ్) విక్రయించడం ద్వారా కొనుగోలుదారుల ఆరోగ్యానికి హాని కల్గిస్తే కఠిన చర్యలకు గురవ్వాల్సి వస్తుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ (పిఎసిపి) వర్గాలు ఈ మేరకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి. ఇటీవల ఇద్దరు వ్యక్తులు నిబంధనల్ని ఉల్లంఘించి ఆహార పదార్థాల అమ్మకాలు జరిపినందుకు కఠినంగా శిక్షింపబడ్డారు. వారిలో ఒకరికి మూడు నెలల జైలు శిక్ష, 30,000 ఒమర్ రియాల్స్ ఫైన్ విధించారు. చట్టాల ప్రకారం 2 వేల రియాల్స్ నుంచి 50,000 రియాల్స్ వరకూ ఫైన్, అలాగే 3 నెలల నుంచి 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష నిబంధనల్ని ఉల్లంఘించినవారికి తప్పదు. ప్యాకేజీలపై తప్పుడు సమాచారం, భద్రత లేని ఆహార పదార్థాల అమ్మకం వంటివి తీవ్ర నేరాలుగా పరిగణింపబడతాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







