మదీనా: 6 మదీనా జిల్లాల్లో కర్ఫ్యూ పొడగింపు
- March 29, 2020
కరోనా వైరస్ కట్టడికి మదీనా ప్రిన్సిపాలిటీ తమ పరిధిలోని ప్రాంతాలపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. శనివారం ఉదయం ఆరు గంటల నుంచే కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అయితే..వ్యాధి విస్తరణ తీవ్రతను బట్టి కర్ఫ్యూ గడువును పొడగించాలా లేదా అనేది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అల్ షురయ్ బాత్, బని జుఫ్ర్, ఖుర్బాన్, అల్ జుమా జిల్లాలతో పాటు ఇస్కాన్, బని కుద్ర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూని అమలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఆయా ఆరు జిల్లాల నుంచి ప్రజలు బయటికి వెళ్లకూడదని, అలాగే ఇతరులను జిల్లాలోకి అనుమతించకూడదని ప్రిన్సిపాలిటీ అధికారులు సూచించారు. అందరూ తప్పనిసరిగా స్వీయ నిర్బంధంలోనే ఉండాలని హెచ్చరించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లైతే 937 కి కాల్ చేయాలని తెలిపారు. అయితే..నిత్యావసర సరుకులు, మెడిసిన్ కొనేందుకు మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు