కరోనా ఎఫెక్ట్:రోగుల కోసం రక్త దానం చేయాలని ఒమన్ ప్రభుత్వం పిలుపు
- March 29, 2020కరోనా కారణంగా రోగులకు చికిత్స ఆగిపోకుండా ఒమన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుంది. రోగుల కోసం ప్రజలు రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్ సేవల విభాగం అధికారులు పిలుపునిచ్చారు. రక్త దానం చేయాలనుకునేవారు బవ్షర్ బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో రక్తం ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అలాగే గవర్నరేట్ పరిధిలోని స్థానిక బ్లడ్ బ్యాంక్ కేంద్రాల్లో కూడా రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రక్త దానం చేయాలనుకునే వారు 94555648కి ఫోన్ చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా కారణంగా ఇతర రోగులకు చికిత్స ఆగిపోకుండా ఉండేందుకు ఈ చర్యలను చేపట్టారు. అయితే..వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని రక్త దాన శిబిరాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూడా డీబీబీఎస్ అధికారులు చెప్పారు. పరిమిత సంఖ్యలోనే రక్త దానం చేసేవారిని శిబిరాలకు అనుమతిస్తారు. ముందస్తుగా బుక్ చేసుకున్న టైం స్లాట్స్ ప్రకారం అనుమతిస్తారు. అంతేకాదు..కోవిడ్ ప్రభావిత ప్రాంతాల వారు, వైరస్ సోకిన పేషెంట్లతో కాంటాక్ట్ అయిన వారి విషయంలో కొన్ని షరతులు విధించారు. బ్లడ్ డొనేట్ చేసే సమయానికి 28 రోజులు గడిచి ఉంటేనే వారి నుంచి రక్తం సేకరిస్తారు. అలాగే కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు కోలుకున్న మూడు నెలల తర్వాతే రక్త దానం చేయాలని అధికారులు స్పష్టం చేశారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం