COVID-19/దుబాయ్: ఆస్తిని విరాళంగా ఇచ్చిన భారతీయ వ్యాపారవేత్త
- March 29, 2020
దుబాయ్: COVID-19 ను ఎదుర్కోవటానికి యూఏఈ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫింజా జ్యువెలరీ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ అజయ్ శోబ్రజ్ F ఫిన్జా తన ఉదారత్వాన్ని నిరూపించారు.
25 సంవత్సరాలుగా దుబాయ్ లో నివసిస్తున్న ఫింజా, 'జుమేరా లేక్ టవర్స్'లోని తన భవనాన్ని విరాళంగా ఇచ్చారు. కరోనా కు వ్యతిరేకంగా పోరాడుతున్న యూఏఈ ప్రభుత్వానికి బాధిత రోగులను నిర్బంధించడం కోసం ఈ భవనాన్ని ఇస్తున్నాను అంటూ 'టు సపోర్ట్ అండ్ గివ్ బ్యాక్ దట్ కేర్స్' అనే శీర్షికతో దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) కు లేఖ రాశారు ఫింజా.
77,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 400 మందికి వసతి అందించగల ఈ భవనం అవసరమైన అన్ని ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా డీప్ క్లీనింగ్, శానిటైజేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ సర్వీసింగ్ సహా అన్ని అవసరమైన సర్వీసింగులు చేయించి సిద్ధంగా ఉంది అని అధికారులు తెలిపారు.
అజయ్ శోబ్రజ్ F ఫిన్జా ఇలా అన్నారు: “ఇలాంటి సవాలు సమయాల్లో, ఈ మహమ్మారిని అధిగమించడానికి సమాజం కలిసి రావడం మరియు మనం నివసించే దేశానికి మద్దతు ఇవ్వడం అత్యవసరం. ఈ క్లిష్టమైన కాలంలో ప్రభుత్వానికి నా సహాయాన్ని అందించడం మరియు గత 25 సంవత్సరాలుగా నా విజయానికి మరియు వృద్ధికి తోడ్పడుతున్న నగరానికి మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.”
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?