COVID-19/దుబాయ్: ఆస్తిని విరాళంగా ఇచ్చిన భారతీయ వ్యాపారవేత్త
- March 29, 2020దుబాయ్: COVID-19 ను ఎదుర్కోవటానికి యూఏఈ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఫింజా జ్యువెలరీ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ అజయ్ శోబ్రజ్ F ఫిన్జా తన ఉదారత్వాన్ని నిరూపించారు.
25 సంవత్సరాలుగా దుబాయ్ లో నివసిస్తున్న ఫింజా, 'జుమేరా లేక్ టవర్స్'లోని తన భవనాన్ని విరాళంగా ఇచ్చారు. కరోనా కు వ్యతిరేకంగా పోరాడుతున్న యూఏఈ ప్రభుత్వానికి బాధిత రోగులను నిర్బంధించడం కోసం ఈ భవనాన్ని ఇస్తున్నాను అంటూ 'టు సపోర్ట్ అండ్ గివ్ బ్యాక్ దట్ కేర్స్' అనే శీర్షికతో దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA) కు లేఖ రాశారు ఫింజా.
77,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 400 మందికి వసతి అందించగల ఈ భవనం అవసరమైన అన్ని ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా డీప్ క్లీనింగ్, శానిటైజేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ సర్వీసింగ్ సహా అన్ని అవసరమైన సర్వీసింగులు చేయించి సిద్ధంగా ఉంది అని అధికారులు తెలిపారు.
అజయ్ శోబ్రజ్ F ఫిన్జా ఇలా అన్నారు: “ఇలాంటి సవాలు సమయాల్లో, ఈ మహమ్మారిని అధిగమించడానికి సమాజం కలిసి రావడం మరియు మనం నివసించే దేశానికి మద్దతు ఇవ్వడం అత్యవసరం. ఈ క్లిష్టమైన కాలంలో ప్రభుత్వానికి నా సహాయాన్ని అందించడం మరియు గత 25 సంవత్సరాలుగా నా విజయానికి మరియు వృద్ధికి తోడ్పడుతున్న నగరానికి మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.”
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు