'తెలుగు కళా స్రవంతి, అబుధాబి' అధ్వర్యంలో 'సంక్రాంతి సంబరాలు'
- January 25, 2016
అబుధాబి లోని తెలుగు కళా స్రవంతి వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి 600 మందికి పైగా మంది కుటుంబాలతో సహా హాజరయ్యారు.మొదటగా సంక్రాంతి విశిష్టతను తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ 38 తెలుగు బడి పిల్లల కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది. తర్వత అబూధాబి మహిళలు గొబ్బిమ్మలు పేర్చి పాటలతో హోరెత్తించారు,ఆ వెంటనే వనిత సంస్థ ద్వార ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా అబుధాబి అతివలు బృందాలుగా ఏర్పడి ఆకర్షనీయమైన ముగ్గులు వేశారు.తర్వాత పిల్లల ఆటల పోటీలు,పురుషుల కబడ్డీ,స్త్రీల ఖోఖో పోటీలు నిర్వహించారు.సాంప్రదాయ తెలుగు వంటకాలతో భోజన కర్యక్రమం ముగించుకొని తర్వాత పిల్లలకు భోగిపళ్ల కార్యక్రమం నిర్వహించారు.చివరాగ తెలుగు క్యాలెండరు,బహుమతుల పంపిణి,లక్కి బహుమతుల పంపిణితో కార్యక్రమం ముగిసింది.తెలుగు కళా స్రవంతికి చెందిన 25 కో-ఆర్డినేటర్స్ ఈ కార్యక్రమాన్ని కలసికట్టుగా జయప్రదం చేసారు.
మాగల్ఫ్ టీం తరుపున 'తెలుగు కళా స్రవంతి' వారికి అభినంధనులు









తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







