యూఏఈ: 5 నిమిషాల డ్రైవ్-త్రూ కోవిడ్ -19 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: షేక్ మొహమ్మద్
- March 30, 2020యూఏఈ/అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ 'షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్', కరోనావైరస్ పరీక్షల కోసం అబుధాబీలో డ్రైవ్-త్రూ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేంద్రాలను యూఏఈ అంతటా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే 10 రోజుల్లో, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా, అల్ ఐన్ మరియు అల్ ధఫ్రాలో పరీక్షా కేంద్రాలు ప్రారంభమవుతాయి. ఈ డ్రైవ్-త్రూ కేంద్రాలు అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిఉంటాయి అని అబుదాబి మీడియా కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది.
Mohamed bin Zayed instructs @DoHSocial to launch further drive-through centres across the UAE to test for Coronavirus “COVID-19”, following the launch of the first test centre in Abu Dhabi. pic.twitter.com/L2hu3GrAtb
— مكتب أبوظبي الإعلامي (@admediaoffice) March 29, 2020
కొత్త కేంద్రాల సంప్రదింపు వివరాలు, నియామక విధానాలకు సంబంధించిన మరింత సమాచారం ప్రకటించబడుతుంది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు