యూఏఈ: 5 నిమిషాల డ్రైవ్-త్రూ కోవిడ్ -19 పరీక్షా కేంద్రాల ఏర్పాటు: షేక్ మొహమ్మద్
- March 30, 2020యూఏఈ/అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ 'షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్', కరోనావైరస్ పరీక్షల కోసం అబుధాబీలో డ్రైవ్-త్రూ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేంద్రాలను యూఏఈ అంతటా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాబోయే 10 రోజుల్లో, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా, అల్ ఐన్ మరియు అల్ ధఫ్రాలో పరీక్షా కేంద్రాలు ప్రారంభమవుతాయి. ఈ డ్రైవ్-త్రూ కేంద్రాలు అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిఉంటాయి అని అబుదాబి మీడియా కార్యాలయం ఆదివారం ట్వీట్ చేసింది.
Mohamed bin Zayed instructs @DoHSocial to launch further drive-through centres across the UAE to test for Coronavirus “COVID-19”, following the launch of the first test centre in Abu Dhabi. pic.twitter.com/L2hu3GrAtb
— مكتب أبوظبي الإعلامي (@admediaoffice) March 29, 2020
కొత్త కేంద్రాల సంప్రదింపు వివరాలు, నియామక విధానాలకు సంబంధించిన మరింత సమాచారం ప్రకటించబడుతుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు