కరోనా/యూఏఈ: 2021 కు వాయిదా పడనున్న ఎక్స్పో 2020
- March 30, 2020దుబాయ్: కరోనా మహమ్మారికి ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న సంగతి చూస్తున్నాం. కరోనా ధాటికి ఇప్పటికే టోక్యో లో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదాపడ్డ సంగతి విదితమే. దుబాయ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అతిపెద్ద ఈవెంట్ 'Expo 2020'. దీనికి గాను దుబాయ్ ఎంతో వ్యయప్రయాసలకు లోనై ప్రపంచపు అతిపెద్ద ఎక్స్పో గా తీర్చిదిద్దెందుకు సర్వ సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు దుబాయ్ చేపడుతున్న ఈ Expo కి ఎదురుదెబ్బ కరోనా రూపంలో ఎదురైంది.
ఈరోజు సాయంత్రం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కరోనా వ్యాపించకుండా కట్టడి చేసేందుకు ఈ ఎక్స్పో ను ఒక సంవత్సరం పాటు వాయిదావేయాలని యూఏఈ కి ఇతర దేశాలు సిఫారసు చేశాయి. ఈ ప్రతిపాదనకు యూఏఈ తన మద్దతు ప్రకటించింది, కానీ, పాలకమండలి కొన్ని ప్రక్రియలను అనుసరించి జనరల్ అసెంబ్లీ నుండి మూడింట రెండు వంతుల మెజారిటీ ఓటు పొందిన తర్వాతే ఎక్స్పో వాయిదాపై తుది నిర్ణయం ఉంటుంది అని యూఏఈ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు