కరోనా పై యుద్ధం చేస్తున్న పోలీస్ సోదరులకి భారీగా శానిటైజర్స్ అందించిన నిఖిల్
- March 31, 2020మహామ్మారి కరోనా పై యావత్ ప్రపంచం యుద్ధం చేస్తోంది. మన దేశంలో కూడా 21 లాక్ డౌన్ ప్రకటించి కరోనా నివారణకు అన్ని విధాల కార్యచరణలు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమైతనప్పటికీ డాక్టర్లు, పోలీస్ అధికారులు, హెల్త్ డిపార్ట్ మెంట్ సిబ్బంది పొంచి ఉన్న ప్రమాదాన్ని లెక్క చేయకుండా మనందరి కోసం పని చేస్తున్నారు. ముందుగా వారందరి సురక్షణ మనందరి ప్రధమ కర్తవ్యం. అందుకే వివిధ రంగాలకు చెందిన ప్రముఖలంతా పోలీస్, వైద్య సిబ్బందికి చేయూతగా తమకు తోచిన సహాయసహకారాలు అందిస్తున్నారు. తెలుగు చిత్రసీమ నుంచి కూడా కొందరు హీరోలు, నిర్మాతలు ఇప్పటికే కరోనా నివారణకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు పెద్ద మొత్తంలో ఆర్ధిక సహాకారం అందిస్తున్నారు. యంగ్ హీరో నిఖిల్ సైతం ఇటీవలే 8 లక్షల విలువ చేసే మాస్కులు, శానిటరీ కిట్లు వివిధ ఆసుపత్రుల్లో ఉన్న వైద్యలుకు అందించారు. తాజాగా వివిధ ఏరియాల్లో డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు అందజేశారు. ఈ పరంపర ఇంకా కొనసాగిస్తున్నట్లుగా నిఖిల్ సిద్ధార్థ తెలిపారు.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్