కోవిడ్ -19: నివాసితులకు ఉచిత వీసా పొడిగింపులు మంజూరు

- March 31, 2020 , by Maagulf
కోవిడ్ -19: నివాసితులకు ఉచిత వీసా పొడిగింపులు మంజూరు

దుబాయ్: కరోనా మహమ్మారి జీవనశైలినే కాకుండా ఆర్ధిక సంక్షోభానికి కారణమవుతోంది. ఈ కఠినమైన సమయాల్లో నివాసితుల జీవితాన్ని కొద్దిగా సులభతరం చేయడానికి దుబాయ్ తీవ్రంగా కృషి చేస్తోంది.

రెసిడెన్సీ వీసాల రెన్యూవల్ విషయంలో యూఏఈ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చ్ 1, 2020 నాటి రెసిడెన్సీ వీసా గడువు ముగిసినా వెంటనే రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గడువు ముగిసిన రెసిడెన్సీ వీసాలకు మూడు నెలల మినహాయింపునిచ్చింది. మూడు నెలల తర్వాత ఎలాంటి ఫీజు చెల్లించకుండానే రెసిడెన్సీ వీసాలను మళ్లీ యథావిధిగా రెన్యూవల్ చేసుకోవచ్చని కేబినెట్ స్పష్టం చేసింది. అప్పటివరకు డిజిటల్ విధానంలో ఇక్కడి నివాసితులకు టెంపరరీ లైసెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం పత్రాలు, అనుమతులు, లైసెన్సులు మరియు వాణిజ్య రిజిస్టర్లతో సహా అన్ని సమాఖ్య ప్రభుత్వ సేవలకు పొడిగింపు వర్తిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com