ఏపీలో కరోనా కలకలం..
- April 01, 2020
ఏపీ:ఏపీలో కరోనా విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్కసారిగా రాష్ట్రము అలెర్ట్ అయ్యింది. కాగా 14 మంది బాధితుల్లో ఏలూరులో 8 మంది, భీమవరంలో రెండు ఇద్దరు, ఉండి , గుండుగోలను, నారాయణపురం, పెనుగొండల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా భారిన పడ్డారు. వీరంతా ఢిల్లీ లోని జమైతా ఇస్లామిక్ సభలకు వెళ్లి వచ్చిన వారే కావడం విశేషం. అయితే వీరిలో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. ఢిల్లీ వెళ్లి వచ్చారనే అనుమానంతో పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఘటనతో పశ్చిమ గోదావరిలో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా అధికారులు వారి బంధువులను ఇప్పటికే ఐసోలేషన్ కు తరలించారు. వారు ఎవరెవరిని కలిశారు అని వెతికే పనిలో అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు