కువైట్:ఆన్ లైన్ విద్య ఆప్షన్ మాత్రమే..10 రోజుల్లో తుది నిర్ణయం
- April 01, 2020
కువైట్:పబ్లిక్, ప్రైవేట్ విద్య విషయంలో మరో పది రోజుల్లోనే తమ తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని కువైట్ విద్యాశాఖ మంత్రి డాక్టర్ సౌద్ అల్ హర్బి వెల్లడించారు. తమ నిర్ణయాన్ని పది రోజుల్లో పార్లమెంటరీ అండ్ కల్చర్ కమిటీకి నివేదిస్తామని కూడా ఆయన తెలిపారు. అయితే విద్యా పురోగతి మాత్రం ఎట్టి పరిస్థితి ఆగిపోకుండా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. స్పీకర్ మర్జఖ్ అల్ గనిమ్ ఆధ్వర్యంలో పార్లమెంటరీ కమిటీతో జరిగిన సమావశం తర్వాత విద్యాశాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్య విధానాని అవాంతరాలు లేకుండా అన్ని అంశాలపై చర్చించామని అన్నారు. అయితే..ఆన్ లైన్ లో విద్య అందించటం అనేది ఒక అప్షన్ మాత్రమేనని అని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్నామని, అయినా ఆలస్యం చేయకుండా విద్యా విధానంపై ఎదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







