కరోనా ఎఫెక్ట్: ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల లెటర్ ఉంటేనే ఉద్యోగులకు అనుమతి.
- April 02, 2020మస్కట్:కరోనా వైరస్ కారణంగా దేశమంతా కర్ఫ్యూ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఒమన్ భద్రతా అధికారులు ఉద్యోగుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేట్ ఉద్యోగులైనా తప్పనిసరిగా తమ సంస్థల నుంచి లెటర్ తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆయా సంస్థల సీల్ తో పాటు సదరు ఉద్యోగి ఏ తరహా విధులు నిర్వహిస్తున్నాడు..ఎందుకోసం అతని సేవలు అత్యవసరమని భావిస్తున్నారో కూడా లేఖలో పేర్కొనాలని కోరారు. దేశ పౌరులతో పాటు నివాసితులు(రెసిడెంట్స్) లెటర్ తో పాటు తమ సివిల్, ఐడీ కార్డులను తప్పకుండా వారితోనే ఉంచుకోవాలని కూడా అధికారులు సూచించారు. దేశంలో పలు చోట్ల రాయల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రాయల్ ఒమన్ పోలీసులు సంయుక్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉద్యోగులు సంబంధిత డాక్యుమెంట్లు చూపిస్తేనే అనుమతిస్తారని అధికారులు స్పష్టం చేశారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ