కరోనా వైరస్:టర్మ్ 3 బస్సు ఫీజులు తిరిగి ఇచ్చేయండి..
- April 02, 2020దుబాయ్:దుబాయ్ లోని అన్ని స్కూల్స్ తల్లిదండ్రుల దగ్గర్నుంచి వసూలు చేసిన టర్మ్ 3 బస్సు ఫీజులను తిరిగి ఇచ్చేయాలని విజ్ఞాణ, మానవ వనరుల అభివృద్ధి అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్ కారణంగా కొంత కాలంగా అన్ని స్కూల్స్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎదురైంది. తమ పిల్లలు ఇంట్లో ఉండే చదువుకుంటున్నారు కనుక బస్సు ఫీజులను మినహాయించాలని కొద్ది రోజులుగా కోరుతున్నారు. తల్లిదండ్రుల వినతిని పరిశీలించిన KHDA టర్మ్ 3 బస్సు ఫీజులను తిరిగి పేరెంట్స్కు ఇచ్చేయాలని నిర్ణయించింది. అలాగే ఇండియా, పాకిస్తాన్ స్కూల్స్ ఏప్రిల్ 5 నుంచి మొదలయ్యే అకాడమిక్ ఇయర్ కు సంబంధించి టర్మ్ 1 బస్సు ఫీజులను వసూలు చేస్తే వాటిని కూడా తల్లిదండ్రులకు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ