కరోనా వైరస్:టర్మ్ 3 బస్సు ఫీజులు తిరిగి ఇచ్చేయండి..
- April 02, 2020దుబాయ్:దుబాయ్ లోని అన్ని స్కూల్స్ తల్లిదండ్రుల దగ్గర్నుంచి వసూలు చేసిన టర్మ్ 3 బస్సు ఫీజులను తిరిగి ఇచ్చేయాలని విజ్ఞాణ, మానవ వనరుల అభివృద్ధి అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్ కారణంగా కొంత కాలంగా అన్ని స్కూల్స్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎదురైంది. తమ పిల్లలు ఇంట్లో ఉండే చదువుకుంటున్నారు కనుక బస్సు ఫీజులను మినహాయించాలని కొద్ది రోజులుగా కోరుతున్నారు. తల్లిదండ్రుల వినతిని పరిశీలించిన KHDA టర్మ్ 3 బస్సు ఫీజులను తిరిగి పేరెంట్స్కు ఇచ్చేయాలని నిర్ణయించింది. అలాగే ఇండియా, పాకిస్తాన్ స్కూల్స్ ఏప్రిల్ 5 నుంచి మొదలయ్యే అకాడమిక్ ఇయర్ కు సంబంధించి టర్మ్ 1 బస్సు ఫీజులను వసూలు చేస్తే వాటిని కూడా తల్లిదండ్రులకు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల