కరోనా ఎఫెక్ట్:36 వేల మంది ఉద్యోగులపై సస్పెన్షన్
- April 02, 2020లండన్:బ్రిటీష్ ఎయిర్వేస్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తాత్కాలికంగా తొలగించనున్నది. సుమారు 36 వేల మంది ఉద్యోగులను సస్పెండ్ చేయాలని ఆ సంస్థ భావిస్తున్నది. దీనిపై ఆ కంపెనీ త్వరలోనే నిర్ణయం వెలుబడించనున్నది. కరోనా సంక్షోభం వల్ల ఆ కంపెనీకి చెందిన దాదాపు అన్ని విమానాలు గ్రౌండ్ అయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో యునైట్ యూనియన్తో బ్రిటీష్ ఎయిర్వేస్ ఓ ఒప్పందం కుదర్చుకోనున్నది. బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్, ఇంజినీర్లు, హెడ్ ఆఫీసులో పనిచేసే దాదాపు 80 శాతం మంది ఉద్యోగుల వరకు విధుల నుంచి సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎయిర్వేస్ నిర్ణయం వల్ల ఉద్యోగాలు కోల్పోయేవారు.. ప్రభుత్వ స్కీమ్ నుంచి బెనిఫిట్ పొందనున్నారు. వారికి నెలకు 2500 పౌండ్లు ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..