మరో ఏడాది వరకూ కరోనా సంక్షోభం:ఇరాన్

- April 02, 2020 , by Maagulf
మరో ఏడాది  వరకూ కరోనా సంక్షోభం:ఇరాన్

టెహ్రాన్:ఇరాన్‌లో కరోనా సంక్షోభం వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు హసాన్ రోహానీ తెలిపారు. 'ఫలానా రోజున కరోనా అదుపులోకి వస్తుందని చెప్పలేం. అసలు ఈ మహమ్మారి విషయంలో అటువంటి అంచనాలకు రాలేము' అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కరోనా పిడికిలో నగిలిపోతున్న ఇరాన్ దీని నుంచి ఎలాగైనా బయటపడేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే స్కూళ్లు, ప్రార్థనా స్థలాలను మూసివేసింది. అక్కడి కరోనా కేసుల సంఖ్య దాదాపు 48 వేలు కాగా.. 3 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కల్పోయారు. మరోవైపు.. ఐరోపా ఖండంలో కరోనా కేసుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com