కరోనా క్రైసిస్ లో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయుల కి అండగా నిలిచిన 'TFJA'
- April 03, 2020కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన క్రైసిస్ అంతా ఇంతా కాదు. ప్రపంచం మెత్తం అతలాకుతలమవుతుంది. ఎక్కడి వారు అక్కడే వుండిపోవాలి అంటూ లాక్డౌన్ ప్రకటించిన తరువాత అందరికి ఎం చేయాలో తెలియని అయెమయ పరిస్థితిలో అందరూ వుండిపోయారు. ఒక పక్క తెలుగు సినిమా 24 క్రాఫ్ట్ లకి CCC ద్వారా పెద్దలు అండగా నిలవటం అందరూ హర్జించాల్సిన విషయం. అయితే 24 / 7 ఏరోజు సెలవు అనే మాట లేకుండా తెలుగు సినిమా కబుర్లు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సినిమా అభిమానులకి చేరవేర్చే సినిమా జర్నలిస్ట్ లకి తెలుగు ఫిల్మ్జర్నలిస్ట్ అసోసియెషన్ అండగా వుంటుందని తమ భరోసా తెలియజేసారు.
ప్రెసిడెంట్ లక్ష్మినారాయణ మాట్లాడుతూ.." ఫీల్డ్ లో అంటే డైలీ ప్రెస్మీట్స్ కి హజరయ్యే ప్రతి ఓక్క జర్నలిస్ట్ లకి , వీడియో జర్నలిస్ట్ లకి, ఫోటో జర్నలిస్ట్ కి ఆసరాగా వుంటాము. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కునే భాగంలో 35 మంది తెలుగు సినిమా పాత్రికేయులకి నెలరోజులకి సరిపడా నిత్యావసరాల సరుకుల తో అండగా నిలిచాము. ఇలానే అందరం కలిసి కట్టుగా ఈ సమస్యని ఎదుర్కోవాలని కొరుకుంటున్నాము. ఏ ఓక్కరూ ఆకలి తొ వుండకూడదనేది మన అసోషియెషన్ ముఖ్య వుద్దేశ్యం. మీకు ఏ ఇబ్బంది కలిగినా నాకు కాని, నాయిడు సురేంద్ర కుమార్ కి గాని, రాంబాబు(tv5)కి కాని ఫోన్ చేసి తెలియజేయవచ్చు.. మీ అందరికి చివరిగా నా ప్రత్యేఖమైన విన్నపం ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి.. దీన్ని అందరూ అర్దం చేసుకొవాలి, ఏ ఓక్కరికి సమస్య వచ్చినా అందరం అండగా వుండి పోరాడాలి.. అన్ని సమస్యలు పోయి మళ్ళి అందరం ఆనందంగా మన పనులు చేసుకొవాలని ఆ భగవంతుడ్ని తెలుగు ఫిల్మ్జర్నలిస్ట్స్ అసోసియెషన్ ద్వారా కొరుకుంటున్నాను. మంచి కార్యక్రమాలకి వెన్నుదండుగా వున్న మీ అందరికి నా ప్రత్యేఖ ధన్యవాదాలు." అని అన్నారు
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ