ఏపీలో వారికి పూర్తి జీతాలు
- April 04, 2020
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా అత్యవసర సేవలందిస్తోన్న వైద్యారోగ్యశాఖ, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మూడు కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించాల్సిందిగా ఆర్థికశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.
వాస్తవానికి రాష్ట్రంలో అఖిలభారత సర్వీసు అధికారులకు 60శాతం మేర, ప్రభుత్వ ఉద్యోగులందరికీ 50శాతం మేర, నాలుగోతరగతి ఉద్యోగులకు 10శాతం మేర జీతాలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అత్యవసర సేవల విభాగాలుగా ఈ శాఖలకు చెందిన ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నందున వీరికి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాల్సిందిగా సీఎం ఆదేశించారు. కొవిడ్-19 నివారణ చర్యలపై సమీక్షించిన సీఎం ఈ సూచనలు చేశారు. కరోనా వైరస్ నివారణకు వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈ మూడు కేటగిరీలకు సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించాలని, ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు