మనామ:శానిటైజర్లను ఎక్కువ ధరలకు అమ్ముతున్న ఫార్మసీ షాపు మూసివేత
- April 05, 2020
మనామ:ప్రపంచమంతా కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ముప్పుతిప్పలు పడుతుంటే..ఇదే అవకాశమన్నట్లు కొందరు ఫార్మా స్టోర్స్ నిర్వాహకులు కక్కుర్తి ప్రదర్శిస్తున్నారు. శానిటైజర్లు, మాస్కులు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలను దోపిడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా పెడచెవిన పెట్టిన ఓ ఫార్మా స్టోర్ పై పరిశ్రమ, వాణిజ్య, పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. శానిటైజర్లను ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు నిర్ధారణ కావటంతో రిఫ్ఫాలోని ఫార్మా షాపును మూసివేశారు. వినియోగదారుల భద్రతను ఉల్లంఘించిన నేరానికి షాపును క్లోజ్ చేసినట్లు అధికారులు నోటీస్ అంటించారు. 250 మిల్లీలీటర్ల శానిటైజర్ ధరను ఏకంగా 80 శాతం ఎక్కువ ధరకు అమ్ముతుండగా, 500 శానిటైజర్ ను రెట్టింపు ధరకు అమ్ముతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలకు చేయూతగా నిలబడాల్సిన ఈ సమయంలో ఎవరైనా ఫార్మా స్టోర్స్ నిర్వాహకులు, ఇతర దుకాణదారులు ప్రజలను దోచుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?