ఫ్రీ బస్సు సర్వీసులు,ట్యాక్సీ ఛార్జీల్లో మినహాయింపు ప్రకటించిన దుబాయ్
- April 05, 2020
దుబాయ్:కీలక రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, అత్యవసరంగా బయటికి వచ్చిన ప్రజల కోసం ఉచితంగా బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు దుబాయ్ రోడ్లు, రవాణా శాఖ ప్రకటించింది. అలాగే ట్యాక్సీల్లోనూ వెళ్లేవారికి 50 శాతం మినహాయింపు ప్రకటించారు. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు స్టెరిలైజేషన్ (వైరస్ సంహరణకు రసాయనాల పిచికారి) ప్రక్రియను మరో రెండు వారాలు పొడగించిన నేపథ్యంలో మెట్రో, ట్రామ్ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసింది. దీంతో అత్యవసరంగా బయటికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు దుబాయ్ ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రస్తుత సమయం సవాళ్లతో కూడుకున్నదని, ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సూచనల మేరకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో వీలైనంత వరకు ప్రజలకు వీలైనంత ఎక్కువ మద్దతు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







