ఫ్రీ బస్సు సర్వీసులు,ట్యాక్సీ ఛార్జీల్లో మినహాయింపు ప్రకటించిన దుబాయ్
- April 05, 2020
దుబాయ్:కీలక రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, అత్యవసరంగా బయటికి వచ్చిన ప్రజల కోసం ఉచితంగా బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు దుబాయ్ రోడ్లు, రవాణా శాఖ ప్రకటించింది. అలాగే ట్యాక్సీల్లోనూ వెళ్లేవారికి 50 శాతం మినహాయింపు ప్రకటించారు. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు స్టెరిలైజేషన్ (వైరస్ సంహరణకు రసాయనాల పిచికారి) ప్రక్రియను మరో రెండు వారాలు పొడగించిన నేపథ్యంలో మెట్రో, ట్రామ్ సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసింది. దీంతో అత్యవసరంగా బయటికి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు దుబాయ్ ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ప్రస్తుత సమయం సవాళ్లతో కూడుకున్నదని, ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సూచనల మేరకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో వీలైనంత వరకు ప్రజలకు వీలైనంత ఎక్కువ మద్దతు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







