కరోనా అలర్ట్:ఖతార్ లో కొత్తగా 279 పాజిటీవ్ కేసులు..నలుగురికి పెరిగిన మృతుల సంఖ్య
- April 06, 2020
ఖతార్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా మరో 279 మందికి వైరస్ సోకింది. దీంతో ఖతార్ లో కరోనా బాధితుల సంఖ్య 1604కి పెరిగింది. కరోనాతో 88 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. దీంతో ఇప్పటివరకు ఖతార్ కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. కరోనాను అడ్డుకునేందుకు శానిటైజ్ (పరిశుభ్రత) విధానాలను అనుసరిస్తున్నా, నిర్బంధాన్ని కఠినంగా అమలు చేస్తున్నా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే..విదేశాల నుంచి తిరిగి వస్తున్న పౌరులు, నివాసుల ద్వారా వైరస్ తీవ్రత పెరుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. వైరస్ బారిన పడిన వారిని నిర్బంధం(క్వారంటైన్) లో ఉంచామని వారికి తగిన ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు కల్పించామని అధికారులు తెలిపారు. ఇక ఇవాళ మరో 3,806 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 35,757 మందికి కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. దేశంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ ల సంఖ్యను పెంచనున్నట్లు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు