గోఎయిర్ ఎయిర్లైన్స్: ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్
- April 06, 2020ముంబై:ప్రముఖ విమానయాన సంస్థ గోఎయిర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గోఎయిర్ ప్రతినిధి వెల్లడించారు. గోయిర్ సంస్థ 15 ఏప్రిల్ 2020 నుండి దేశీయ విమానాల్లో ప్రయాణానికి సంబంధించి బుకింగ్ ప్రారంభిస్తుందని.. అంతర్జాతీయ విమానాల బుకింగ్.. మే 1 నుండి ప్రారంభం అవుతుందని వెల్లడించారు. గత వారం, భారతదేశ జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియా ఏప్రిల్ 30 వరకు అన్ని విమానాల కోసం ముందస్తు బుకింగ్లను నిలిపివేసింది.
కరోనావైరస్ యొక్క వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్డౌన్ మార్చి 25 నుండి కేంద్రం ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దాంతో దేశీయ విమానాలు ఆగిపోయాయి, కానీ అంతకు ముందే చాలా విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేశాయి.. దీనికి కారణం ప్రయాణికులు లేకపోవడమే. ఈ క్రమంలో గోఎయిర్ సంస్థ లాక్ డౌన్ తరువాత రోజు బుకింగ్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించడం కీలక పరిణామంగా మారింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి