లాక్డౌన్ కొనసాగించడం తప్ప మరో మార్గం లేదు:కేసీఆర్
- April 06, 2020
హైదరాబాద్:రాష్ట్రంలో సోమవారం నాటికి 364 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగించాలి అని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్ధికంగా దెబ్బతింటే కోలుకుంటామని అన్న కేసీఆర్.. ప్రాణాలు కోల్పోతే తిరిగి తీసుకురాలేమని చెప్పారు. కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే భారత్లాంటి ఎక్కువ జనాభా గల దేశంలో లాక్డౌన్ విధించడం తప్ప మరో గత్యంతరంలేదని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ను కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు.
అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,937 మందిని క్వారెంటైన్లో ఉంచామని చెప్పారు.. నిజాముద్దీన్ ఘటనతో కలిపి 364 మంది కరోనా భారిన పడ్డారని అన్నారు. అలాగే ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జ్ చేశామని.. వైరస్ భారిన పడి 11 మంది చనిపోయారని అన్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో 308 మంది చికిత్సలో వున్నారని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన 1089 మందిని గుర్తించామని చెప్పిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది అని తెలిపారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







