లాక్డౌన్ కొనసాగించడం తప్ప మరో మార్గం లేదు:కేసీఆర్
- April 06, 2020
హైదరాబాద్:రాష్ట్రంలో సోమవారం నాటికి 364 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగించాలి అని ముఖ్యమంత్రి అన్నారు. ఆర్ధికంగా దెబ్బతింటే కోలుకుంటామని అన్న కేసీఆర్.. ప్రాణాలు కోల్పోతే తిరిగి తీసుకురాలేమని చెప్పారు. కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే భారత్లాంటి ఎక్కువ జనాభా గల దేశంలో లాక్డౌన్ విధించడం తప్ప మరో గత్యంతరంలేదని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ను కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా చెప్పినట్లు కేసీఆర్ తెలిపారు.
అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,937 మందిని క్వారెంటైన్లో ఉంచామని చెప్పారు.. నిజాముద్దీన్ ఘటనతో కలిపి 364 మంది కరోనా భారిన పడ్డారని అన్నారు. అలాగే ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జ్ చేశామని.. వైరస్ భారిన పడి 11 మంది చనిపోయారని అన్నారు. ఇక గాంధీ ఆస్పత్రిలో 308 మంది చికిత్సలో వున్నారని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లిన 1089 మందిని గుర్తించామని చెప్పిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది అని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు