రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన అక్షయ్

- April 10, 2020 , by Maagulf
రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన అక్షయ్

కరోనా నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యలలో తనవంతు భాగంగా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడు కోట్ల విరాళం అందజేసి మరోసారి సూపర్‌ స్టార్‌ అనిపించుకున్నారు అక్షయ్‌. 

కరోనా నిర్మూలనలో భాగంగా అక్షయ్ కుమార్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్‌ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌కు(పీపీఈ) ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. తమ కుటుంబాలని కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యులు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆర్మీ అధికారులు, వాలంటీర్లు.. తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సహాయానికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com