రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన అక్షయ్
- April 10, 2020
కరోనా నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న సహాయ చర్యలలో తనవంతు భాగంగా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 25 కోట్లు విరాళం అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా మూడు కోట్ల విరాళం అందజేసి మరోసారి సూపర్ స్టార్ అనిపించుకున్నారు అక్షయ్.
కరోనా నిర్మూలనలో భాగంగా అక్షయ్ కుమార్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. మున్సిపల్ కార్మికుల ఆరోగ్యం కోసం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్కు(పీపీఈ) ఈ డబ్బును అందజేశారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. తమ కుటుంబాలని కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యులు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆర్మీ అధికారులు, వాలంటీర్లు.. తదితరులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సహాయానికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







