పెరిగిన గృహహింస కేసులు

- April 10, 2020 , by Maagulf
పెరిగిన గృహహింస కేసులు

కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలన్నీ కోవిడ్‌-19 నియంత్రణకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. దీంతో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న దేశాలన్నింటిలో గృహహింస పెరుగుడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌తో ఉపాధి పోయిందన్న బాధ, నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితితో భర్తలు తమ అసహనాన్ని భార్యలపై చూపుతున్నట్లు కేసులను బట్టి తెలుస్తోంది. లాక్‌డౌన్‌తో భారత్‌లోనూ గృహహింస కేసుల సంఖ్య రెట్టింపు అయిందని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లలో ఉంటున్న పురుషులు తమ అసహనాన్ని భార్యలపై ప్రదర్శిస్తున్నారని.. నాలుగు గోడలకే పరిమితమైన మహిళలు తమ గోడును ఎవరికి, ఎలా చెప్పకోవాలో తెలియక సతమతమవుతున్నారని రేఖాశర్మ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, గృహిణులు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా వాట్సాప్‌ నంబర్‌ +91 7217735372 ను కేటాయించింది. కోవిడ్‌-19, లాక్‌డౌన్‌ నేపథ్యంలో బాధలో ఉన్న లేదా గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతు, సహాయం కోసం మహిళా కమిషన్‌ వాట్సాప్‌ నంబర్‌ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. లాక్‌డౌన్‌ ముగిసేవరకు మాత్రమే ఈ నంబర్‌ పనిచేస్తుందని వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com