చిరంజీవి సహాయంతో రాజనాల నాగలక్ష్మి ఆపరేషన్ విజయవంతం
- April 11, 2020
హైదరాబాద్:పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి సహాయంతో ఈ రోజు రాజనాల నాగలక్ష్మి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. స్టార్ హాస్పిటల్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్.గోపీచంద్ ఆధ్వర్యంలో సుమారు 3.30 నిమిషాలు ఆపరేషన్ సమయం పట్టింది అని సర్జరీ చాలా విజయవంతం అయ్యిందని తెలిసింది. ఈ రోజు మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. ఆమెకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సక్సెస్ ఫుల్ గా జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ఆపరేషన్ గురించి చిరంజీవి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే వున్నారు. ఆపరేషన్ పూర్తి అవ్వగానే మొదటి ఫోన్ డాక్టర్.గోపీచంద్ చిరంజీవి కి తెలియజేసారు.
మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ` డాక్టర్ గోపీచంద్ కి..వాళ్ల బృందానికి ధన్యవాదాలు. అలాగే ఈ విషయాన్ని సమయానికి నా దృష్టికి తీసుకొచ్చిన స్వామి నాయుడికి, హైదరాబాద్ వరకూ రావటానికి ఏర్పాట్లు చేసిన బి.దిలీప్ కి, ఇంతదూరం ప్రయాణించడానికి అనుమతిచ్చిన రెండు రాష్ట్రాల పోలీసు అధికారులకి..ఇతర సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాని` అన్నారు.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







