మాల్దీవుల్లో చిక్కుకున్న దుబాయ్కి చెందిన భారతీయ జంట
- April 11, 2020
దుబాయ్: దుబాయ్లో ఉండే కొత్తగా పెళ్లైన భారతీయ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లి చిక్కుకుంది. మహమ్మారి కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో అక్కడి ప్రభుత్వం ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో ఈ కొత్త జంట చిక్కుకుపోయింది. దుబాయ్లో ఉండే రోహన్ భాటియా, రియా భాటియాకు ఇటీవలే వివాహమైంది. దీంతో హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు. మార్చి 20న దుబాయ్కి తిరిగి రావాల్సింది. కానీ, మార్చి 19వ తేదీ మధ్యాహ్నం నుంచే విమాన సర్వీసులు ఆగిపోయాయి. దాంతో ఈ నవ దంపతులు మాల్దీవుల్లోనే ఉండిపోయారు. ప్రస్తుతం తాము ఇడిలిక్ బీచ్ రిసార్ట్లో ఉంటున్నామని, తిరిగి ఎప్పుడు వస్తామో కూడా తెలియడం లేదని రోహన్ పేర్కొన్నాడు. దుబాయ్లో తాను ట్రేడ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నట్లు తెలిపాడు. ఇక మాల్దీవుల్లో ఇప్పటివరకు 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 13 మంది కోలుకున్నట్లు ఈ దంపతులు తెలిపారు.
భారత రాయబార కార్యాలయం సహాయం చేస్తోంది, కాని రియా కెనడియన్ పాస్పోర్ట్ హోల్డర్ కావడంతో మా పరిస్థితి క్లిష్టంగా ఉంది మరియు నాకు భారతీయ పాస్పోర్ట్ ఉంది. మేము ఇద్దరం యూ.ఏ.ఈ లోని మా కుటుంబాలతో కలిసి స్థిరపడ్డాము మరియు అక్కడే మేము ఉంటున్నామని రోహన్ భాటియా తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?