కరోనా వైరస్: స్వదేశాలకు వెళ్ళేందుకు ఇండియన్స్కి యూఏఈ అనుమతి
- April 11, 2020
దుబాయ్: భారతీయులు అలాగే ఇతర దేశాలకి చెందిన పౌరులు, యూఏఈ నుంచి ఆయా దేశాలకు వెళ్ళేందుకు యూఏఈ అనుమతినిచ్చినట్లు భారత్ లోని యూఏఈ రాయబారి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ రహ్మాన్ అల్ బన్నా వెల్లడించారు. దీనికి సంబంధించి యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఓ ‘నోట్ వెర్బలె’(Note Verbale)ని విడుదల చేయడం జరిగింది. అన్ని ఎంబసీలకూ ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు అల్ బన్నా వివరించారు. అయితే, కరోనా నెగెటివ్గా తేలినవారికి మాత్రమే తమ స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తారు. తమ దేశంలో అద్భుతమైన టెస్టింగ్ ఫెసిలిటీస్ వున్నాయనీ, 500,000 మందికి పైగా ఇప్పటికే పరీక్షలు నిర్వహించామని తెలిపారాయన. లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయినవారిని మానవీయ కోణంలో వారి దేశాలకు పంపించేందుకు చిత్తశుద్ధితో యూఏఈ వున్నట్లు వివరించారు. కరోనా పాజిటివ్గా తేలినవారిని మాత్రం యూఏఈలోనే వుంచుతారు. వారికి అక్కడే వైద్య చికిత్స అందిస్తారు. అయితే, ఈ విషయమై ఇంతవరకు భారత ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రాలేదని వివరించారాయన. కాగా, స్వదేశాలకు పంపడంలో వృద్ధులు, గర్భవతులకు ప్రాధాన్యతనివ్వనున్నారు. మరోపక్క, వీసా గడువు విషయంలో గల్ఫ్ దేశాల్లో వుంటోన్న భారతీయులెవరూ ఆందోళన చెందనవసరం లేదని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ చెప్పారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







