మస్కట్:ప్రాధాన్యత ప్రకారమే తరలింపు..భారతీయుల విజ్ఞప్తిపై రాయబార కార్యాలయం స్పష్టత
- April 12, 2020మస్కట్:అత్యవసరంగా భారత్ కు వెళ్లాలనుకునే వారు విమాన సర్వీసులు పునరుద్ధరించే వరకు వేచి చూడాల్సిందేనని ఒమన్ లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయం వరకు అంతా వేచి చూడాల్సిందేనని స్పష్టం చేసింది. తాము అత్యవసరంగా భారత్ వెళ్లాలంటూ రాయబార కార్యాలయానికి ఎక్కువ సంఖ్యలో ఈ మేల్స్, ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఒమన్ భారత రాయబారి మును మహవర్ ఈ ప్రకటన చేశారు. అయితే..విమానాల సర్వీసులు పునరుద్దరించిన వెంటనే అత్యవసరం ఉన్నవారికే మొదటి ప్రధాన్యం ఇస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత్ వెళ్లాలనుకునే వారు తమ వివరాలను పొందుపర్చేందుకు ప్రత్యేకంగా గూగుల్ ఫామ్ ను క్రియేట్ చేసింది. అందులో సొంత దేశానికి వెళ్లాలనుకుంటున్న వారు తమ కాంటాక్ట్ నెంబర్లతో పాటు ఏ అవసరం కారణంగా వెళ్లాలనుకుంటున్నారో స్పష్టంగా పేర్కొవాలి. విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత అత్యవసరం అనుకున్న వారికి తొలి ప్రధాన్యత క్రమంలో జర్నీ ఏర్పాట్లు చేయనున్నట్లు మును మహవర్ స్పష్టం చేశారు. అయితే..ప్రయాణం ఎప్పుడు అనే విషయంపై రాయబార కార్యాలయాన్ని పదే పదే సంప్రదించాల్సిన అవసరం లేదని, విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రధాన్యత క్రమాన్ని బట్టి మేమే వాళ్లను సంప్రదిస్తామని కూడా ఆయన తెలిపారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్