ఢిల్లీలో కోవిడ్ కారణంగా 5 మంది మృతి

- April 12, 2020 , by Maagulf
ఢిల్లీలో కోవిడ్ కారణంగా 5 మంది మృతి

ఢిల్లీ:శనివారం దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) కారణంగా ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1,000 దాటింది, ఢిల్లీ.. మహారాష్ట్ర తరువాత రెండవ రాష్ట్రంగా మరియు ముంబై తరువాత రెండవ నగరంగా పాజిటివ్ రోగులకు నాలుగు అంకెల మార్కును దాటింది. ఐదు మరణాలలో, నలుగురు 60 ఏళ్లు పైబడిన రోగులు ఉన్నారు..

వారు కరోల్ బాగ్‌కు చెందిన 79 ఏళ్ల మహిళ, సదర్ బజార్‌కు చెందిన 60 ఏళ్ల మహిళ, ఆజాద్ మార్కెట్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి, ఒక తమిళనాడుకు చెందిన 68 ఏళ్ల వ్యక్తి ఉండగా.. ఆల్రెడీ మూత్రపిండాల వ్యాధి, గుండె జబ్బు, రక్తపోటు వంటి జబ్బులు కలిగిన మల్కగంజ్ కు చెందిన 44 ఏళ్ల మహిళ ఉన్నారు. శనివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఈ వివరాలు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com