కువైట్:వీసా నిబంధనలు పాటించని ప్రవాసీయుల కేంద్రాలను పరిశీలించిన ఉప ప్రధాని

- April 12, 2020 , by Maagulf
కువైట్:వీసా నిబంధనలు పాటించని ప్రవాసీయుల కేంద్రాలను పరిశీలించిన ఉప ప్రధాని

కువైట్:నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసీయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను ఉప ప్రధాని, అంతర్గత మంత్రిత్వ వ్యవహారాల శాఖ అనస్ అల్ సలెహ్ పరిశీలించారు. కబద్ లోని శిబిరాలను పరిశీలించిన ఆయన..అక్కడి వసతులు, భద్రత ఏర్పాట్లు, శిబిరాల్లోని ప్రశాసీయుల పరిస్థితులను పరిశీలించారు. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన జ్లీప్ అల్-షోయౌఖ్ జిల్లాలోని ముందస్తు భద్రత చర్యలను ఆయన తనిఖీ చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించేందుకు ఉన్న అవకాశాలపై ఆరా తీయటంలో భాగంగా ఆయా ప్రాంతంలో పర్యటించారు. లాక్ డౌన్ విధించేందుకు అవసరమైన పరిస్థితులు, భద్రత ఏర్పాట్ల సన్నద్దత గురించి ఆయన అధికారులను అడిగితెల్సుకున్నారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com