కోవిడ్ 19:ప్రవాసీయుడు తప్పించుకున్నాడనే పుకార్లను కొట్టిపారేసిన ఒమన్
- April 12, 2020
ఒమన్ లోని ఓ ప్రవాసీయుడు మస్కట్ నుంచి విలాయత్ మన్కుల్ కు పారిపోయాడనే పుకార్లను ఒమన్ ప్రభుత్వ సమాచార కేంద్రం కొట్టిపారేసింది. అలాంటి ఘటనలేవి చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రవాసీయుడు పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో జనం ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ సమాచార కేంద్రం వివరణ ఇచ్చింది. మస్కట్ నుంచి అల్ ధహిరా గవర్నేట్ లోని విలాయత్ యన్కుల్ కు ప్రవాస కార్మికుడు తప్పించుకొని పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆన్ లైన్ ద్వారా స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని జీసీసీ కోరింది. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?