కోవిడ్ 19:ప్రవాసీయుడు తప్పించుకున్నాడనే పుకార్లను కొట్టిపారేసిన ఒమన్
- April 12, 2020
ఒమన్ లోని ఓ ప్రవాసీయుడు మస్కట్ నుంచి విలాయత్ మన్కుల్ కు పారిపోయాడనే పుకార్లను ఒమన్ ప్రభుత్వ సమాచార కేంద్రం కొట్టిపారేసింది. అలాంటి ఘటనలేవి చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రవాసీయుడు పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో జనం ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ సమాచార కేంద్రం వివరణ ఇచ్చింది. మస్కట్ నుంచి అల్ ధహిరా గవర్నేట్ లోని విలాయత్ యన్కుల్ కు ప్రవాస కార్మికుడు తప్పించుకొని పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆన్ లైన్ ద్వారా స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని జీసీసీ కోరింది. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







