కోవిడ్ 19:ప్రవాసీయుడు తప్పించుకున్నాడనే పుకార్లను కొట్టిపారేసిన ఒమన్

- April 12, 2020 , by Maagulf
కోవిడ్ 19:ప్రవాసీయుడు తప్పించుకున్నాడనే పుకార్లను కొట్టిపారేసిన ఒమన్

ఒమన్ లోని ఓ ప్రవాసీయుడు మస్కట్ నుంచి విలాయత్ మన్కుల్ కు పారిపోయాడనే పుకార్లను ఒమన్ ప్రభుత్వ సమాచార కేంద్రం కొట్టిపారేసింది. అలాంటి ఘటనలేవి చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రవాసీయుడు పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో జనం ఆందోళన చెందుతున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ సమాచార కేంద్రం వివరణ ఇచ్చింది. మస్కట్ నుంచి అల్ ధహిరా గవర్నేట్ లోని విలాయత్ యన్కుల్ కు ప్రవాస కార్మికుడు తప్పించుకొని పారిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆన్ లైన్ ద్వారా స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని జీసీసీ కోరింది. అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com