యూఏఈ:49,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు..కొత్తగా 370 కేసులు నమోదు

- April 12, 2020 , by Maagulf
యూఏఈ:49,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు..కొత్తగా 370 కేసులు నమోదు

యూఏఈ:కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలను మరింత వేగవంతం చేసింది యూఏఈ ప్రభుత్వం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 49,000 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. కొత్తగా జరిపిప పరీక్షల ఫలితంగా కొత్తగా 370 పాజిటీవ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా నమోదైన కేసుల్లో వివిధ దేశాల పౌరులు ఉన్నారని, అయితే వాళ్లందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు వివరించారు. ప్రస్తుతం నమోదైన ఈ కొత్త కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,360కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇదిలాఉంటే కరోనాతో ఆసియా దేశాలకు చెందిన ఇద్దరు చనిపోయారని అధికారులు ప్రకటించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 16కి చేరింది. ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com