రియాద్:లంచం తిరస్కరించిన పోలీస్ అధికారిపై దాడి
- April 12, 2020
రియాద్:ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను పాటించకుండా కొందరు యువకులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. అడ్డుకున్న పోలీసులపైనే దాడులు చేస్తున్నారు. సౌదీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వీకెండ్ కావటంతో ఓ యువకుడు లాక్ డౌన్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ బైక్ పై రోడ్డెక్కాడు. అయితే..గస్తీలో ఉన్న పోలీసు అతన్ని ఆపటంతో అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే..ఆ పోలీస్ అధికారి లంచం తీసుకునేందుకు నిరాకరించటంతో ఏకంగా అఫీసర్ పైనే దాడికి తెగడబ్డాడు. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేశాడు. దీంతో అవినీతి నిరోధక శాఖ ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి తుదపరి విచారణకు తరలించింది. ఇదిలాఉంటే..మరో కేసులో తీర్పులను ప్రభావితం చేసేలా జడ్జి, మిలటరీ కల్నల్ లంచం తీసుకున్నారనే ఆరోపణలపై విచారణ చేపట్టినట్టు అవినీతి శాఖ అధికారులు వెల్లడించారు. జడ్జి, కల్నల్ ఇద్దరు అన్నాదమ్ములని, ఈ కేసులో ఓ వ్యాపారవేత్త, మరో న్యాయవాది ప్రమేయం కూడా ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







