తెలంగాణలో 531కి చేరుకున్న కరోనా కేసుల సంఖ్య
- April 12, 2020
తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను ఇప్పటికే అధికారులు గుర్తించి, రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా బారినపడి ఇద్దరు మృతి చెందగా, ఏడుగురు ఆస్పత్రి నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 531కు చేరుకున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా రాష్ట్రంలో కరోనా బారినపడి ఇప్పటి వరకు పదహారు మంది మృతి చెందగా.. వైరస్ నుంచి కో లుకుని 103 మంది దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 412 కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







