కోవిడ్ 19:భారీ శబ్ధాలతో ప్రశాంతతకు భంగం కలిగిస్తే వాహనాలు సీజ్
- April 13, 2020
మనామా:లాక్ డౌన్ విధింపుతో ఎక్కువ సమయంలో ఇంట్లోనే ప్రజల ప్రశాంతతకు ఇబ్బందులు తలెత్తకుండా బహ్రెయిన్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి భారీ శబ్ధాలతో వాహనాలను నడిపితే ఆ వాహనాలను వెంటనే స్వాధీనం చేసుకుంటామని ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరించింది. స్వాధీనం చేసుకున్న వాహనాలను నెల వరకు తమ అధీనంలోనే ఉంటాయని కూడా వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో ఇళ్లలో ఉండే ప్రజల ప్రశాంతతకు అధిక ప్రధాన్యం ఇస్తామని, మరీ ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో శబ్ధాలు చేసుకుంటూ వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ప్రజలంతా ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించినట్లు ప్రజలు ఒకే చోట గుమికూడొద్దని అధికారులు సూచించారు.
----రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







