భారత్:10వేలు దాటిన పాజిటివ్‌ కేసులు

- April 14, 2020 , by Maagulf
భారత్:10వేలు దాటిన పాజిటివ్‌ కేసులు

భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. కేసుల సంఖ్య 10 వేలు దాటింది. రోజురోజుకు వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మంగళావారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 1211 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్యాయి.. దాంతో కరోనా బాధితుల సంఖ్య 10వేలు దాటింది.మరోవైపు గత 24 గంటల్లో 31 మంది చనిపోయారు..

దాంతో మరణాల సంఖ్య కూడా 339 కి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 10,363కు ఉండగా. ఇప్పటివరకు 339 మంది మృత్యువాత పడ్డారు. దేశ వ్యాప్తంగా 1035 కరోనా బాధితులు కొలుకున్నారని వెల్లడించింది. ఇదిలావుంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉదయం వరకు 17,76,867 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అందులో మొత్తం 1,11,828 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com