యూఏఈ విసిట్/టూరిస్ట్ వీసాల గడువుపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
- April 14, 2020
దుబాయ్: కరోనా తో అన్ని దేశాలలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. మరి యూఏఈ కి వివిధ కారణాల వల్ల వచ్చినవారికి వీసాలపై అనేక అనుమానాలు వ్యక్తమతున్నాయి. రెసిడెన్సీ వీసాలపై గడువును 2020 చివరి వరకు పొడిగించారు. అయితే విసిట్/టూరిస్ట్ వీసాపై వచ్చినవారికి పలు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై అధికారులు ఈరోజు క్లారిటీ ఇచ్చారు.
మీరు యూఏఈ కు విసిట్/టూరిస్ట్ వీసాపై వచ్చినట్టయితే, మీ వీసాలు 2020 చివరి వరకు చెల్లుబాటు అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఐతే ఈ నిబంధన కేవలం March 1,2020 తర్వాత గడువు తీరుతున్న వీసాలపై మాత్రమే అని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) మీడియా సమావేశంలో తెలిపింది.
నివాసితులు/ప్రవాసీయులు తమకు గల ఏదైనా సందేహాలను GDRFA-దుబాయ్ యొక్క 'అమెర్' కాల్ సెంటర్ 8005111 (యూఏఈ లో ఉన్నట్లయితే) లేదా +97143139999 (యూఏఈ వెలుపల ఉన్నట్లయితే) కు కాల్ చేసి నివృత్తిచేసుకోవచ్చు. లేదా [email protected] లేదా [email protected] కు ఇమెయిల్ చేయవచ్చు అని ఈ సందర్భగా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు