దుబాయ్: పాస్పోర్ట్ సేవలను పాక్షికంగా తిరిగి ప్రారంభించిన భారత కాన్సులేట్
- April 14, 2020
దుబాయ్: కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో పాస్పోర్ట్ సేవలను నిలిపివేశారు. దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ ఏప్రిల్ 15 నుంచి బీఎల్ఎస్ షార్జా సెంటర్(King Faisal Street, Sharjah) ద్వారా భారతీయ దరఖాస్తుదారుల పాస్పోర్ట్ సేవలను పాక్షికంగా తిరిగి ప్రారంభించనుంది. ముందుగా ఏప్రిల్ 30, 2020 న లేదా అంతకు ముందే గడువు ముగిసిన/ముగియనున్న పాస్పోర్ట్ల పునరుద్ధరణకు సంబంధించిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలిపిన అధికారులు.
పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పునరుద్ధరణ కోసం అత్యవసర పరిస్థితుల వివరణతో [email protected] కు ఇమెయిల్ చేయగలరు. దీనిద్వారా షార్జాలోని 'బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఎక్స్క్లూజివ్ సెంటర్ ఫర్ ఇండియన్ పాస్పోర్ట్ అండ్ వీసా సర్వీసెస్'లో అపాయింట్మెంట్ ఏర్పాటు చేస్తుంది కాన్సులేట్. దరఖాస్తుదారులు ఆన్లైన్లో పొందుపరిచినా అన్ని పత్రాలను సిద్ధం చేసుకొని మాత్రమే బీఎల్ఎస్ షార్జా సెంటర్ కు వెళ్లాలని ప్రకటించిన అధికారులు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు