కరోనా/దుబాయ్: కార్మికుల రాకపోకలపై షరతులు
- April 14, 2020
దుబాయ్: కరోనా ను కట్టడి చేసేందుకు యూఏఈ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా దుబాయ్ లో పనిచేస్తున్న కార్మికుల కదలికలపై షరతులు విధించింది ప్రభుత్వం. కంపెనీలు తమ కార్మికులను దుబాయ్ నుండి బయటకు పంపించడానికి ఇకపై అనుమతించరనీ, అలాగే దుబాయ్ బయట నుండి వచ్చేవారిని సైతం అనుమతించబోమని తాజాగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా, అబుదాబి కూడా అబుదాబి లో పనిచేస్తున్న కార్మికుల కదలికలపై షరతులు విధించింది ప్రభుత్వం. కంపెనీలు తమ కార్మికులను అబుదాబి నుండి బయటకు పంపించడానికి ఇకపై అనుమతించరనీ, వారి ప్రయాణాన్ని అబుధాబి/అల్ ఐన్/అల్ ధఫ్రా పరిధిలో పరిమితం చేస్తారని, అంతే కాదు, ఇతర ఎమిరేట్ల నుండి కార్మికులు అబుధాబిలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధిస్తుంది అంటూ అబుధాబి మీడియా కార్యాలయం సోమవారం తెలిపింది.
ఈ చర్య కార్మికుల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి, కరోనా వ్యాపించటాన్ని తగ్గించడానికి నివారణ చర్యగా అభివర్ణించింది మీడియా కార్యాలయం.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







