కరోనా/దుబాయ్: కార్మికుల రాకపోకలపై షరతులు
- April 14, 2020
దుబాయ్: కరోనా ను కట్టడి చేసేందుకు యూఏఈ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా దుబాయ్ లో పనిచేస్తున్న కార్మికుల కదలికలపై షరతులు విధించింది ప్రభుత్వం. కంపెనీలు తమ కార్మికులను దుబాయ్ నుండి బయటకు పంపించడానికి ఇకపై అనుమతించరనీ, అలాగే దుబాయ్ బయట నుండి వచ్చేవారిని సైతం అనుమతించబోమని తాజాగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా, అబుదాబి కూడా అబుదాబి లో పనిచేస్తున్న కార్మికుల కదలికలపై షరతులు విధించింది ప్రభుత్వం. కంపెనీలు తమ కార్మికులను అబుదాబి నుండి బయటకు పంపించడానికి ఇకపై అనుమతించరనీ, వారి ప్రయాణాన్ని అబుధాబి/అల్ ఐన్/అల్ ధఫ్రా పరిధిలో పరిమితం చేస్తారని, అంతే కాదు, ఇతర ఎమిరేట్ల నుండి కార్మికులు అబుధాబిలోకి ప్రవేశించడాన్ని కూడా నిషేధిస్తుంది అంటూ అబుధాబి మీడియా కార్యాలయం సోమవారం తెలిపింది.
ఈ చర్య కార్మికుల ఆరోగ్యం మరియు భద్రతను కాపాడటానికి, కరోనా వ్యాపించటాన్ని తగ్గించడానికి నివారణ చర్యగా అభివర్ణించింది మీడియా కార్యాలయం.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







